పూల మార్కెట్లో శ్రావణమాసం సందడి

53చూసినవారు
కడియం మండలం కడియపులంక అంతర్ రాష్ట్ర పూల మార్కెట్ గురువారం కోలాహలంగా మారింది. స్వాతంత్ర్య దినోత్సవానికి తోడు శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కావడంతో కొనుగోలు దారులు మార్కెట్ కు భారీగా తరలి వచ్చారు. ప్రస్తుత సీజన్లో పూల దిగుబడి ఆశాజనకంగా ఉండదు. దీంతో కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి బంతి, చామంతి, గులాబీలను భారీగా దిగుమతి చేసుకున్నామని వ్యాపారస్థులు తెలిపారు.

సంబంధిత పోస్ట్