10, 000 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

77చూసినవారు
10, 000 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
కోరుకొండ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు కోరుకొండ, గోకవరం, సీతానగరం మండలాల్లో మంగళవారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడులలో భాగంగా 10, 000 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. అలాగే 300 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు సెబ్‌ కోరుకొండ సీఐ బంగారురాజు తెలిపారు. 25 మంది నిందితులుపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్టు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్