గోకవరం మండలం కృష్ణుని పాలెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకుడు సచివాలయ మాజీ కన్వీనర్ మండిగ గంగయ్య జగంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో టిడిపిలో చేరారు. క్లస్టర్ ఇంచార్జ్ కన్నబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఆయన టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.