ప్రతిపక్ష పార్టీలకు ప్రజల్లో ఆదరణ లేదని రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా విమర్శించాడు. శుక్రవారం రాజానగరం మండలం సంపత్ నగరం, జి. యర్రంపాలెం, పుణ్యక్షేత్రం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో తమకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.