అమలాపురం ఆర్టీసీ డిపోలో సోమవారం ఆంబోతు వీరంగం సృష్టించింది. ఆంబోతు అరుస్తూ ప్రయాణికుల మీదకు రావడంతో భయంతో ప్రయాణికులు పరుగులు తీశరు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ఆంబోతును బందించేందుకు ప్రయత్నాలు చేసారు. చివరకు అమలాపురం నల్ల వంతెన వద్ద ఆంబోతును బంధించారు.