సంక్షేమ పాలనందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డి కోరారు. పెదపూడి మండలం పెద్దాడలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వైసీపీ అందించిన సంక్షేమ పథకాలు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరారు. వైసీపీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందని అన్నారు.