ప్రపంచంలో భారతదేశ విశ్వ గురు స్థానం అధిరోహించింది

65చూసినవారు
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో విశ్వ గురువు స్థానం అధిరోహించిందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తిలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంగళవారం కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతోపాటు ఆర్థిక, రక్షణ రంగాల్లో అగ్రగామిగా నిలిపారన్నారు.

సంబంధిత పోస్ట్