వెలుగు కార్యాలయానికి తాళం వేసిన టీడీపీ నేత

50చూసినవారు
అనపర్తి వెలుగు కార్యాలయ అధికారుల పనితీరు దారుణంగా ఉందని, అభయ హస్తం పథకానికి సంబంధించిన సమస్యలను తెలుపుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కర్రి వెంకటరామారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు నిరసన వ్యక్తం చేసి గురువారం కార్యాలయానికి తాళం వేశారు. అభయహస్తం పథకానికి ప్రీమియం చెల్లించినా లబ్దిదారులకు పింఛను అందడం లేదన్నారు. 2నెలలుగా తిరుగుతున్నా అధికారులు స్పందించడంలేదన్నారు.

సంబంధిత పోస్ట్