పి. గన్నవరం నియోజకవర్గంలో దాళ్వా వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. కూలీల కొరత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైతులందరూ వరి కోత యంత్రాలతో కోతలు కోయిస్తున్నారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉండడంతో రైతులందరూ ఒక్కసారిగావరి కోతల ప్రారంభించడంతో వరి కోత యంత్రాలకు డిమాండ్ పెరిగింది. దీంతో చిన్న రైతులు కూలీలతో కోతలు కోయించి పంట ఒబ్బిడి చేసుకుంటున్నారు.