కర్ణాటకలో తన మిత్రపక్షం జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవిగా చెప్తున్న అభ్యంతరకర వీడియోల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ‘దేశంలో మేం మాతృ శక్తికి అండగా నిలబడతామన్నది స్పష్టం. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అది ఆ రాష్ట్ర శాంతిభద్రతల అంశం. మేం విచారణకు అనుకూలంగా ఉన్నాం’ అని తెలిపారు.