కిర్లంపూడి: అక్రమ మద్యం విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు

70చూసినవారు
కిర్లంపూడి: అక్రమ మద్యం విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు
కిర్లంపూడి మండలంలోని గెద్దనాపల్లిలో అక్రమంగా బెల్టాపు నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్టు స్థానిక ఎస్ఐ జి. సతీష్ శనివారం రాత్రి మీడియాకు తెలిపారు. అతని నుంచి 20 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో మరో బెల్ట్ షాప్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్టు జగ్గంపేట ఎస్ఐ టి. రఘునాథరావు తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్