జగ్గంపేటలోని కాకినాడ రోడ్ లో గల
ఎన్టీఆర్ స్మారక విగ్రహం వద్ద సోమవారం అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈఅన్నా క్యాంటీన్ ను గండేపల్లి జగ్గంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహనరావు, మారిశెట్టి భద్రములు ప్రారంభించారు. జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ ల ఆధ్వర్యంలో ప్రతి సోమవారం అన్నా క్యాంటీన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఈ సోమవారం అక్కిన సుదర్శన్ రావు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు.