జ్యోతుల నెహ్రూకు ఘన స్వాగతం పలికిన గోకవరం మండల జన సైనికులు

1045చూసినవారు
గోకవరం మండల జనసైనికులు జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు గోకవరంలో ఘన స్వాగతం పలికారు. మంగళవారం జరిగిన ఈకార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాటే తమకు వేదవాక్కని, ఆయన తీసుకున్న నిర్ణయం శిరోధార్యమని, పవన్ కళ్యాణ్ పై అభిమానం ఉన్న కార్యకర్తే నిజమైన జనసైనికుడని జనసేన నాయకుడు పదిలం మురళి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్