టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల సంక్షేమం అభివృద్ధి, బలహీన వర్గాల అభివృద్దె టిడిపి అజెండా అని రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. శనివారం గండేపల్లి మండలం యల్లమిల్లి, నాయకంపల్లి గ్రామాలలో ప్రజల నిరాజనాలతో మహిళల మంగళహారతులతో చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించిన జ్యోతుల నెహ్రూ ఈ సందర్బంగా మాట్లాడారు.