శ్రీలక్ష్మీ గణపతి ఆలయ వద్ద సరస్వతి పూజలు
కాకినాడలో దిగుమతి వారి వీధిలో శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద సరస్వతి పూజలు ఘనంగా నిర్వహించడం జరిగిందని మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. శనివారం రాత్రి శ్రీశ్రీశ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన 18 అడుగుల ధాన్యంతో తయారు చేసిన వినాయకుడిని ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 11 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందన్నారు.