డాక్టర్ హత్యకు నిరసనగా ఇంద్రపాలెంలో కొవ్వొత్తుల ర్యాలీ

50చూసినవారు
కోల్ కతా వైద్య కళాశాల పిజి వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యంత పాశవిక అత్యాచారం, హత్యపై నిరసన తెలియజేస్తూ కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. దివంగత డాక్టరమ్మ చిత్రపటానికి పూలతో నివాళులర్పించి కొవ్వొత్తుల ప్రదర్శనతో మానవహారం నిర్వహించారు. డాక్టర్ మౌమితి జోహార్, వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలతో మారుమోగింది.

సంబంధిత పోస్ట్