డెంగ్యూతో వివాహిత మృతి

68చూసినవారు
డెంగ్యూతో వివాహిత మృతి
డెంగ్యూ జ్వరంతో వివాహిత మృతి చెందిన సంఘటన యు.కొత్తపల్లి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. యు కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన ఉమ్మిడి కృప(20) డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ఉంది. వైద్యం కోసం పిఠాపురం ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి వైద్యం అందించారు. అయితే వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం కాకినాడ అపోలో ఆసుపత్రిలో తరలించి వైద్యం అందించిన ఫలితం లేకపోవడంతో బుధవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

సంబంధిత పోస్ట్