పరీక్ష ఫెయిల్‌..విద్యార్థి ఆత్మహత్య

6841చూసినవారు
పరీక్ష ఫెయిల్‌..విద్యార్థి ఆత్మహత్య
కోనసీమ జిల్లాలో విషాదం నెలకొంది. రావులపాలెం ఇందిరానగర్‌కు చెందిన పలివెల శ్రీనివాస్‌ మౌళిశంకర్‌(18) ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫెయిల్‌ కావడంతో మనస్థాపానికి గురయ్యాడు. ఈనెల15న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభ్యం కాకవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం కొమరాజులంక గోదావరి పుష్కర ఘాట్‌ వద్ద విద్యార్థి మృతదేహం లభ్యమైంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్