పోలీసుల నిఘా పెరగటంతో గంజాయి స్మగ్లర్లు రూట్ మార్చారు. ఇప్పటివరకు స్వీట్లు, చాక్లెట్లు, హాష్ ఆయిల్ రూపంలో సరఫరా చేస్తూ వచ్చిన గంజాయిని తాజాగా పౌడర్ చేసి అమ్ముతున్నారు. ఈ పౌడర్ను మిల్క్ షేక్, హార్లిక్స్, బూస్టులో కలుపుతున్నారట. జగద్గిరిగుట్టలోని ఓ కిరాణంలో సైబరాబాద్ పోలీసులు పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. కోల్కతాకు చెందిన మోహన్ జయశ్రీ ట్రేడర్స్ పేరుతో ఈ దందా నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.