టిడిపిలో అత్యున్నత హోదా కలిగిన పోలిట్ బ్యూరో సభ్యునిగా రెడ్డి సుబ్రహ్మణ్యంను ప్రకటించడం పట్ల కొత్తపేట మండల శెట్టిబలిజ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పోలిట్ బ్యూరో లో స్థానం కల్పించిన చంద్రబాబుకు, లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మండల శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని రెడ్డి సుబ్రహ్మణ్యం స్వగృహం నందు మంగళవారం ఆయనను కలిసి ఘనంగా సన్మానించారు.