చాగల్లు: ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

73చూసినవారు
చాగల్లులో పశుగణాభివృద్ధి సంస్థ & పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వైద్య శిబిరాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ పశు వైద్య శిబిరాన్ని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించి మాట్లాడారు. పశువులలో గర్భ కోశ వ్యాధుల నివారణ కోసం ఈ క్యాంపు ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్స్, పాడి రైతులు, టీడీపీ జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్