మండపేటలో బంద్ విజయవంతం

80చూసినవారు
ఎస్సి వర్గీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ బుధవారం మండపేటలో ప్రశాంతంగా ముగిసింది. మాల మహానాడు కార్యకర్తలు, జైభీమ్ సభ్యులు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. ఏడిద సర్పంచ్ బురిగా ఆశీర్వాదం ఆద్వర్యంలో ర్యాలీ నిర్వహించి పట్టణంలోని అన్ని వాణిజ్య సముదాయాలు మూయించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మండపేట టౌన్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్