జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి తోట నరసింహం కు మద్దతుగా ఆయన కుమార్తె , కోడలు ఇరువురు కూడా వైయస్సార్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తోట నరసింహంను గెలిపించాలని కోరుతూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో గోకవరం ఎంపీపీ సుంకర వీరబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని వైయస్సార్ పార్టీకి మద్దతు పలికారు.