కాట్రేనికోన మండలం చెయ్యేరు సచివాలయ వాలంటరీ సిబ్బంది 44 మంది రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ. రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తోడుగా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కు అండగా ఉంటామని అన్నారు. జగన్ మాకెంతో చేశారని, ఈ విధంగా రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. జగన్ను సీఎంగా. సతీష్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామన్నారు.