విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనలో గాయపడ్డ సీఎం జగన్ను సోమవారం పలువురు నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. "బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసే దాడులు చేస్తున్నారు. ప్రజల ఆశీర్వాదం వల్ల ప్రాణాపాయం తప్పింది. మరోసారి అధికారంలోకి వస్తున్నాం.. ఆందోళన వద్దు. ఎలాంటి దాడులూ నన్ను ఆపలేవు." అని పేర్కొన్నారు.