ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు

74చూసినవారు
ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు
నవయుగ కవి చక్రవర్తి జాషువా జయంతిని ఐ.పోలవరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం పిటీఎం ఆధ్వర్యంలో పలు సాహితీ కార్యక్రమాలు జరిపారు. ముందుగా గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జాషువా కవిత్వం సాహితీ ప్రయోజనం మాత్రమే కాదని, హృదయ వేదనని, కరుణరసం, సాంఘిక చైతన్యం మూర్తిభవిస్తూ స్థల కాలాలకు అతీతమైనదని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వీధి సురేష్ బాబు, విత్తనాల వరప్రసాదరావు, ఆర్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్