యానం: ఘనంగా అమ్మవారి 39వ శరన్నవరాత్రి వేడుకలు

78చూసినవారు
కేంద్ర పాలిత ప్రాంతం యానం శివారు కనకాల పేట గ్రామంలో ఉన్న శ్రీ దుర్గాదేవి అమ్మవారు శనివారం గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు. 39వ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మూడవరోజు ఆలయం వద్ద విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ కోణంభట్ల శ్రీరామచంద్రమూర్తి సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్