రహదారిపై వరద నీరు - సమీక్షించిన జేసీ

59చూసినవారు
రహదారిపై వరద నీరు - సమీక్షించిన జేసీ
తూ. గో జిల్లా నిడదవోలు మండలం పరిధిలోని కంసాలిపాలెం - మాధవరం మార్గంలో ప్రవహిస్తున్న రహదారి పైకి ఎర్రకాలువ నీరు చేరడంతో క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులకు అంచనా వేయడం జరిగిందని జిల్లా జేసీ ఎస్. చిన్న రాముడు తెలిపారు. గురువారం తహసీల్దార్ బి. నాగరాజు నాయక్ తో కలిసి జేసీ పరిస్థితులను సమీక్షించారు. ఎటువంటి ప్రమాదం జరుగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చెయ్యడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్