ఉప్పాడలో వారాహి విజయభేరీలో మంగళవారం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ, జగన్మోహన్ రెడ్డి దళితులపై కపటప్రేమ చుపిస్తూన్నారని, అనేక రకాల దళిత సంక్షేమాలు రద్దు చేసారన్నారు. ఇప్పుడన్న సంక్షేమపథకాలను కూటమి అధికారంలోకి రాగానే రద్దుచేయదని, ప్రతి చేతికి పని, ప్రతి చేనుకీ నీరు అనేలక్ష్యంతో ముందుకు సాగుతామన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినానంతరం పిఠాపురం నియోజకవర్గంలో 52గ్రామాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకుంటామన్నారు.