ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ

38578చూసినవారు
ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ
సీఎం జగన్ పై రాళ్ల దాడి నేపథ్యంలో ఈసీ స్పందించింది. ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఈసీ బదిలీ చేసింది. ఏపీ ఇంటెలీజెన్స్ డీజీ సీతారామంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాను బదిలీ చేశారు. ఇద్దరినీ తక్షణమే విధుల నుంచి తప్పించాలని.. వారిని ఎన్నికల విధులకు కూడా దూరంగా ఉంచాలని ఈసీ కీలక ఆదేశాలు ఇచ్చింది. డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులుపై ఈసీకి పలు ఫిర్యాదులు అందాయి. ఇద్దరి స్థానంలో కొత్తవారిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్