గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అయ్యింది. అదే పిఠాపురం వర్మ వైసీపీలో జాయిన్ కాబోతున్నట్లు. అయితే ఈ వార్తలపై తాజాగా స్పందించారు వర్మ. దీనిపై స్పందించిన ఎస్వీఎస్ఎన్ వర్మ.. తాను పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు. తాను చంద్రబాబు మనిషినని.. 2014 నుంచి తనను వైసీపీలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అయితే అది జరగని పని అని చెప్పిన ఎస్వీఎస్ఎన్ వర్మ.. పిఠాపురంలో ఓడిపోతామని తెలిసి ఇలాంటి వార్తలు పుట్టిస్తున్నారని మండిపడ్డారు.