రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 11 నామినేషన్లు దాఖలవగా ఒకరు ఉపసంహరించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవిలత సోమవారం తెలిపారు. కాగా 10 మంది పోటీలో ఉన్నారని చెప్పారు. ప్రధాన అభ్యర్థులుగా కూటమి నుంచి ఆదిరెడ్డి వాసు, వైసీపీ తరపున మార్గాని భరత్ రామ్, కాంగ్రెస్ నుంచి బోడ లక్ష్మీ వెంకట ప్రసన్న బరిలో ఉన్నారు.