అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

57చూసినవారు
అల్లా ఆశీస్సులు ప్రజలoదరిపై ఉండాలని టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు అన్నారు. మంగళవారం రాజమండ్రిలోని తాడితోటలో ఉన్న మసీదులో ఆల్ సమి గ్రూప్ అధినేత అబ్దుల్లా, మైనారిటీ నాయకులు రఫీక్ రాజా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గన్ని కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్