బహుజనుల సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి కృషి: ఆదిరెడ్డి

68చూసినవారు
ఎన్డీఏ కూటమికి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మద్దతు ఇవ్వడం శుభపరిణామం అని రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమ పథకాల నిధులను దారి మళ్ళించిందని ఆరోపించారు. బహుజనుల సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్