స్వర్ణాంధ్ర సాధన కోసం ప్రణాళికలు అందించాలి: కలెక్టర్

81చూసినవారు
స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం మండల స్థాయి ప్రణాళికలను అందించాలని కలెక్టర్ ప్రశాంతి కోరారు. వంద రోజులు, వార్షిక, ఐదేళ్ల ప్రణాళికలతో ప్రతి శాఖ నివేదిక రూపొందించాలన్నారు. గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. రాజమండ్రిలోని కలెక్టరేట్ నుంచి ప్రశాంతి పాల్గొన్నారు. వచ్చేనెల 15వ తేదీలోగా నివేదికలను అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్