సముద్రంలోకి 3, 87, 184 క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల

72చూసినవారు
సముద్రంలోకి 3, 87, 184 క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల
రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి మంగళవారం సాయంత్రానికి 3, 87, 184 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10. 90 అడుగులకు చేరిందన్నారు. ఖరీఫ్ సాగు కోసం డెల్టా కాలువలకు 12, 100 క్యూసెక్కుల నీరు వదిలినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్