ఉచిత ఇసుక పథకంపై కలెక్టర్ ఆదేశాలు

70చూసినవారు
వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉచిత ఇసుక పథకాన్ని అందించేందుకు కార్యచరణ రూపొందించాలని తూ. గో జిల్లా కలెక్టర్ ప్రశాంతి అధికారులను ఆదేశించారు. ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా అధికారులతో కలిసి రాజమండ్రిలోని కలెక్టరేట్ నుండి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్