ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద పెరిగిన నీటిమట్టం

80చూసినవారు
గోదావరికి వరద నీరు రావడంతో ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద నీటిమట్టం పెరుగుతోంది. ఈ మేరకు గురువారం బ్యారేజ్‌ 175 గేట్లను అరమీటరు మేర పైకి ఎత్తి 2, 23, 961 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే తూర్పు డెల్టాకు 2, 200, మధ్య డెల్టాకు 1, 000 పశ్చిమ డెల్టాకు 4, 000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాగా గురువారం సాయంత్రానికి నీటిమట్టం 8. 20 అడుగులుగా నమోదైంది.

సంబంధిత పోస్ట్