ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే గోరంట్ల

80చూసినవారు
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే గోరంట్ల
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. గురువారం రాజమండ్రిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం పాలనలో తవ్వేకొద్ది గోతులు కనిపిస్తున్నాయని, గత ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం చిన్నాభిన్నం అయ్యిందని అన్నారు. ప్రతి రంగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్