జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచి తీరుతుందని జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ధీమా వ్యక్తం చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంతో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా అని ఆదివారం సాయంత్రం మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం గా సైకిల్ గుర్తు ప్రజల గుండెల్లో ముద్రపడి ఉందని ఏ విధమైన భయము లేదని ఈ సందర్భంగా తెలిపారు.