వరుడు మద్యం తాగి ఆలస్యంగా వచ్చాడని వధువు వివాహాన్ని రద్దు చేసింది. ఈ ఘటన తాజాగా బీహార్లోని కటిహార్లో జరిగింది. వరుడు మంజిత్ కళ్యాణ మండపానికి వస్తుండగా మద్యం తాగించారని, పెళ్లి ఖర్చుల కోసం ఖర్చు చేసిన రూ.4 లక్షలను తన కుటుంబానికి ఇవ్వాలని వధువు మనీషా తెలిపింది. డబ్బులు చెల్లించే వరకు మంజిత్తో పాటు అతని తల్లిదండ్రులను వదిలిపెట్టేది లేదని పేర్కొంది. చివరికి వరుడి తరుఫు బంధువులు డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.