సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాజానగరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూములను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అక్కడ చేపట్టిన భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ జగదీష్, కలెక్టర్ వివరించారు.