విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ తెలిపారు. కార్పొరేషన్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దామని చెప్పారు. విద్యారంగాన్ని విస్మరించిన టీడీపీకి ఓటు వేస్తారా? అని ఓటర్లను ప్రశ్నించారు. మహిళల కోసం గత ప్రభుత్వం ఒక్క పథకం కూడా తీసుకురాలేదని విమర్శించారు. కూటమి పేరుతో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మిగనూరులో నిర్వహించిన 'మేమంతా సిద్ధం' సభలో సీఎం ఈ మేరకు మాట్లాడారు.