24 నుంచి భీమేశ్వరాలయం మూసివేత

52చూసినవారు
రామచంద్రపురం మండలం దాక్షారామ
భీమేశ్వర ఆలయాన్ని ఈనెల 24 నుంచి జూన్ 30 వరకు జీర్ణోదరణ పనుల నిమిత్తం మూసివేస్తున్నట్లు ఇఒ పితాని తారకేశ్వరరావు శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. కేంద్ర పురావస్తు శాఖఆధ్వర్యంలో స్వామివారి శివలింగం జీర్ణోదరణ పనులను పూర్తి
చేస్తారని తెలిపారు. స్వామివారికి జరిగే ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన వివరించారు. ప్రధాన అర్చకులు
తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్