
రామచంద్రపురం: మే డే రోజున ఇద్దరు పేదలకు ఉపాధి కల్పించిన మంత్రి
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మేడే పండుగ సందర్భంగా ఇద్దరు నిరుపేద కార్మికులకు ఉపాధి కల్పించి ఆదుకున్నారు. రామచంద్రపురంకు చెందిన ఉపాధి లేని కార్మికుడు మందపల్లి రాముడికి చెప్పులు వ్యాపారం చేసుకునేందుకు వీలుగా ఒక బడ్డీ కొట్టు స్వయంగా తయారు చేయించి మేడే సందర్భంగా గురువారం అందించారు. అలాగే అనసూరి తులసి అనే నిరుపేద మహిళకు కుటుంబ జీవనోపాధి నిమిత్తం బడ్డీ కొట్టు ను తయారు చేయించి అందజేశారు.