ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

74చూసినవారు
డొంకరాయి ఎస్సై శివ కుమార్, తన సిబ్బందితో వై. రామవరం మండలం బొడ్డగండి గ్రామ పంచాయితీ బాబూ నగర్ గ్రామంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలు-2024 పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డొంకరాయి ఎస్సై శివ కుమార్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించు కోవాలని, వచ్చే సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగేలా సహకరించాలని కోరారు. మావోయిస్టులు దళం వంటి వారికి సహాయం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్