ముంపులో ప్రభుత్వ కార్యాలయాలు

54చూసినవారు
రాజోలు మండలంలో శుక్ర, శనివారంలో కురిసిన భారీ వర్షానికి ప్రభుత్వ కార్యాలయాలు ముంపునకు గురయ్యాయి. ఎంఈవో కార్యాలయం, ట్రెజరీ, సీఐ కార్యాలయం, అగ్నిమాపక కేంద్రం, మండల వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ నీరు వచ్చి చేరింది. రాజోలు ట్రెజరీ కార్యాలయంలో వరద నీరు చేరడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. అటు వివిధ పనులపై కార్యాలయానికి వెళ్లే ప్రజలకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు.

సంబంధిత పోస్ట్