జగన్ మానవత్వం గురించి మాట్లాడడం సరికాదు

76చూసినవారు
మాజీ సీఎం జగన్ మానవత్వం గురించి మాట్లాడడం సరికాదని టీడీపీ రాష్ట్ర నాయకుడు బోనం బాబు అన్నారు. ఆయన మామిడికుదురులో ఆదివారం మాట్లాడారు. గత వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ మానవత్వాన్ని చాటుకునే విధంగా ఏ పని చేశారో చెప్పాలని అన్నారు. డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు, డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడిగా చిత్రీకరించి రోడ్డు మీదకి తీసుకువచ్చి కొట్టినప్పుడు జగన్ మానవత్వం ఏమైందన్నారు.

సంబంధిత పోస్ట్