వరద ముంపులోనే లంక గ్రామాలు

80చూసినవారు
భద్రాచలం వద్ద నీటిమట్టం తగ్గినప్పటికీ ధవళేశ్వరం నుంచి దిగువకు భారీగా నీటిని విడుదల చేయడంతో శుక్రవారం రాజోలులో గోదావరి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. గోదావరి ఉద్ధృతికి మండల పరిధిలోని గోదావరి తీర లంక గ్రామాలు ముంపుతో అల్లాడుతున్నాయి. అధికారులు నాటు పడవల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో లంక గ్రామాలకు వెళ్లేవారికి, లంక గ్రామాల నుంచి ఇవతలి తీరానికి వచ్చేవారికి ఇబ్బందులు తప్పట్లేదు.

సంబంధిత పోస్ట్