మలికిపురం: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి

76చూసినవారు
మలికిపురం: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి
మామిడికుదురులో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి మలికిపురం మండలం గొల్లపాలానికి చెందిన కొంబత్తుల శ్రీను(35)గా పోలీసులు గుర్తించారు. క్రేన్ సామాన్ల కోసం శుక్రవారం కొత్తపేట వెళ్లి మామిడికుదురు నుంచి తాటిపాక వైపు తిరిగి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు. ఎస్సై చైతన్య కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్